సిరా న్యూస్,హైదరాబాద్;
అబిడ్స్ గ్రాండ్ హోటల్ వెయిటర్లు కస్టమర్లపై దాడి చేశారు. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి అబిడ్స్ పోస్టాఫీస్ వెనుక ఉన్న గ్రాండ్ హోటల్ వెయిటర్లు కర్రలతో కస్టమర్ల పై దాడి చేసి గాయపరిచారు. విషయం తెలుసుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే స్పందించి ఇన్స్పెక్టర్ అబిడ్స్తో మాట్లాడి గ్రాండ్ హోటల్ వెయిటర్లు, యజమాని పై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు. లేనిపక్షంలో హోటల్కు నిప్పు పెడతామన్నారు.