సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నోవోపాన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ ను ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు.
సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ జెఎన్టీయూ లో భరత్, నితిన్, వర్షిత్ బీటెక్ సెకండియర్ చదువుతున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా హాస్టల్ నుంచి సాయంత్రం బయటకు వెళ్లారు. సంగారెడ్డి నుంచి మరికొంత మంది స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనాలపై రాయదుర్గంలోని దుర్గం చెరువును చూసేందుకు వెళ్లారు. అక్కడ అనుమతించకపోవడంతో తిరుగు ప్రయాణమయ్యారు. పటాన్ చెరు సాకి చెరువు వద్ద కాసేపు కాలక్షేపం చేసిన స్నేహితులు సంగారెడ్డికి వెళ్తున్న క్రమంలో పటాన్ చెరు నోవోపాన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ నడుపుతున్న భరత్ చందర్(19), నితిన్ (18) అక్కడికక్కడే మృతి చెందారు. వర్షిత్ తీవ్ర గాయాలకు గురయ్యాడు. భరత్ చందర్ పాలకుర్తి, నితిన్ జనగామ, వర్షిత్ ఖమ్మం కు చెందిన వారిగా గుర్తించారు.