సిరా న్యూస్,అనకాపల్లి;
అనకాపల్లి లో మాజీ మంత్రి కొణతాలరామకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలపైతీవ్ర విమర్శలు చేసారు. ఈ ప్రభుత్వం లో ఉత్తరాంధ్ర అభివృధి కి ఆటంకం ఏర్పడింది. 2019 లో ఈ ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు అత్యధిక మెజార్టీ 151 సీట్ల తో గెలిపించారు. కానీ ప్రజల నమ్మకాలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేయలేక పోయింది. రాజశేఖర్ రెడ్డి అశయాలకు తూట్లు పొడిచేలా ప్రభుత్వ పాలన సాగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గత ఎన్నికల మ్యానీఫెస్టోలో పొందుపరచిన హామీలను అమలు చేయటం లో ప్రభుత్వం విఫలంఅయింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ నిర్మాణం, గంగవరం పోర్టు లో ప్రభుత్వ భాగం అమ్మకం, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు లాంటి ఉత్తరాంధ్ర ముఖ్య సమస్యలు పరిష్కరించటంలో లో ప్రభుత్వం చిత్తశద్ధితో పనిచేయలేదని అన్నారు.
రాష్ట్రం అప్పుల పాలయింది. అసలు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ల ద్వారా ఎంత అప్పు చేసింది, కార్పొరేషన్ల ద్వారా ఎంత అప్పు చేసింది, అప్పుకి వడ్డీ ఎంత కడుతున్నారు, వడ్డీలు కట్టడం నిమిత్తం ఎంత అప్పులు చేస్తున్నారన్న దానిపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు ..