వికాసిత్ భారత్ సంకల్ప యాత్ర పై అవగాహన సదస్సు

సిరా న్యూస్,కౌతాళం;
వికాసిత్ భారత్ సంకల్పయాత్ర పై పంచాయితీ కార్యాలయంలో ప్రజలకు అవగాహన సదస్సు ఏవో సత్యన్న కల్పించారు. ఈ అవగాహన సదస్సులో వారు మాట్లాడుతూప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ పథకమైనా సామాన్యుల లబ్ది కోసమే. కాని అది వారికి ఎలాంటి ప్రయోజనాన్ని కలిగించిందో.. అసలు ఎలాంటి పథకాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవడం కూడా ముఖ్యం. వాటి అమలు ఎలా ఉందో కూడా ప్రభుత్వం పర్యవేక్షించాలి.అందుకే దీనికోసం కేంద్రం వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను కేంద్రం స్టార్ట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 15న ప్రారంభమైనప్పటి నుంచి ఈ యాత్ర విశేషంగా అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అందిస్తోంది. వీటిపై గ్రామీణ స్థాయిలో చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల లబ్ధి చేకూరడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చిన కారణంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ఉపయోగాలు, ఎవరు వీటికి అర్హులు అనే పూర్తి సమాచారాన్ని అట్టడుగు స్థాయి వర్గాల ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో శేషాద్రి రావు, ఏపీఓ జుబేర్ అహ్మద్, మంత్రాలయం నియోజకవర్గం బిజెపి మండల కన్వీనర్ చిన్న ఈరన్న ,మండల కన్వీనర్ ఈరన్ననాయకులు విష్ణు వర్ధన్ మరియు ఆయా శాఖల అధికారులు, సచివాల సిబ్బంది రెవెన్యూ సిబ్బంది వైద్య సిబ్బంది వాలంటీర్స్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *