సిరా న్యూస్, కోనారావుపేట:
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
-ఉదారత చాటిన తీన్మార్ మల్లన్న సిరిసిల్ల టీం
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన పిట్టల రమేష్ కుటుంబ సభ్యులకు తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షులు బోయిని దేవరాజు రూ. 10వేల ఆర్థిక సహాయం, 50కిలోల బియ్యం అందించారు. ఇటీవలే పిట్టల రమేష్ బైక్ ప్రమాదంలో మృతి చెందగా, అతని కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రమేష్ కుటుంబ సభ్యులకు దాతలు అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల నాగరాజు, వంకాయల ప్రశాంత్, బోయిని రమేష్, ఎల్లయ్య, దండు శంకర్, అనిల్, తుమ్మల రమేష్, తదితరులు పాల్గొన్నారు.