–పాల్గొన్న కార్పొరేటర్లు ,డివిజన్ ఇంచార్జ్లు
సిరా న్యూస్,నెల్లూరు;
నూతన సంవత్సరం 2024 సందర్భంగా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలో సోమవారం ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డికి రూరల్ నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర్లు ఆయా ప్రాంత డివిజన్ ఇన్చార్జిలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం నుంచి వికారాబాద్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జీలు మూలే విజయభాస్కర్ రెడ్డి, ఒరిస్సా శ్రీనివాసులు రెడ్డి, బొబ్బల శ్రీనివాస్ యాదవ్, కువ్వాకొల్లు విజయలక్ష్మి, కో ఆప్షన్ సభ్యురాలు సయ్యద్ మోబిన, మొయిల్లా సురేష్ రెడ్డి, నీళ్ల సునీల్ యాదవ్, కువ్వాకొల్లు బాబ్జి యాదవ్, ఉడతా మురళి యాదవ్, ఇసనాక సురేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.