సిరా న్యూస్,పత్తికొండ;
మురళీధర్ రెడ్డి పోచం రెడ్డి సేవాదళ్ కుటుంబ సభ్యుల నడుమ అమ్మవారి శాల దగ్గర్లోని సేవాదళ్ కార్యాలయం ముందు మరియు పోస్ట్ ఆఫీస్ దగ్గరలోని షాధిఖానా నందు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మహిళలు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొని ఆనందోత్సవాల నడుమ డిసెంబర్ 21 జగనన్న జన్మదిన సందర్భంగా ప్రకటించిన లక్కీ డ్రాను అందరి సమక్షంలో డ్రా చేసి బంగారు కమ్మలు, ప్రెషర్ కుక్కర్లు, గ్రైడర్లు, డైనింగ్ సెట్లు అక్కచెల్లెళ్లకు అందజేశారు. ఇకపై ప్రతి సోమవారం అంబేద్కర్ సర్కిల్ నందు రాజన్న ఉచిత భోజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మరియు సేవాదళ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రెండు వందల రూపాయల గ్యాస్ సబ్సిడీ అందజేస్తామని నూతన సంవత్సరం సందర్భంగా కానుకలు అందజేశారు. అందరూ సంతోషంగా ఉండాలని ఉద్దేశంతో ఈ లక్కీ డ్రా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని అందరూ సహకరించాలని, విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు అనిత, సరోజ, దేవర గట్టు లక్ష్మి, వార్డు సభ్యులు బోడా సావిత్రి, లైట్ నాగరాజు, మాజీ ఉపసర్పంచ్ కే .కోటేశ్వరరావు, మాజీ ఎంపిటిసి గణపతి, కే గోవిందరాజు, చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి, సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు