రజక కృష్ణవేణికి జీర్ణాశయానికి చెందిన ప్యాంక్రియాస్ ఇన్స్పెక్షన్ వ్యాధి
సిరా న్యూస్,శ్రీశైలం;
నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఇస్కాల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబము రజకులైన వెంకటసుబ్బయ్య, కృష్ణవేణి దంపతులు తమ వృత్తి పని చేసుకుంటూ జీవనం సాగించేవారు.రెండు సంవత్సరాల క్రితం కృష్ణవేణి గారి భర్త వెంకటసుబ్బయ్య బైక్ యాక్సిడెంట్ లో మరణించడం వలన కుటుంబ పోషణ భారం కావడంతో చదువుకుంటున్న తమ ఇద్దరు పిల్లలు దివాకర్,దివ్య ఇంటర్మీడియట్ తో ఆపివేసి కుమారుడు దివాకర్ ఆత్మకూరులో ఉన్న బట్టల దుకాణంలో గుమస్తాగా పని చేస్తున్నాడుకానీ ఒక నెల క్రిందట చాకలి కృష్ణవేణి గారి కడుపులో జీర్ణాశయానికి చెందిన ప్యాంక్రియాస్ ( క్లోమము గ్రంధి) కి ఇన్ఫెక్షన్ సోకడం బి.పి మరియు షుగర్ ఎక్కువ కావడం వలన ప్రాణాపాయ స్థితిలో నంద్యాల పద్మావతి నగర్ లో ఇండోర్ స్టేడియం కు ఎదురుగా వున్న ఎన్ ఐ టి సి హాస్పిటల్లో చేర్పించారు.””ఈమె ఆరోగ్యం మెరుగుపడడానికి ఇంకా 2 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలియజేశారు
మెరుగైన వైద్యం కోసం తమ వద్ద డబ్బులు లేకపోవడంతో చికిత్స పొందుతున్న తల్లిని చూసి పిల్లలు బాధపడుతూ దాతలు ఎవరైనా మీ వంతు ఆర్థిక సాయం అందించి మా అమ్మగారి ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నారుచికిత్స పొందుతున్న కృష్ణవేణి కుమారుడు చాకలి దివాకర్ కు ఫోన్ పే నెంబర్6300526519 చాకలి దివాకర్ ద్వారా మీ వంతు ఆర్థిక సహాయం అందించవలసిందిగా దాతలను కోరుకుంటున్నాము