అందరికీ అండగా నిలుస్తా

ఎస్టీ సంఘం రాష్ట్ర నాయకులు సింగం సుబ్బారావు

 సిరా న్యూస్,తాడేపల్లిగూడెం;

గూడెం–పేద వర్గాలకు అండగా నిలుస్తామని, మంచి చెడులలో ముందుండి సహాయపడతానని ఎస్టీ సంఘం రాష్ట్ర నాయకులు సింగం సుబ్బారావు అన్నారు. సోమవారం మెట్ట ఉప్పరగూడెం లో నూతన సంవత్సర వేడుకలను ఎస్టీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సుబ్బారావు చేతులపై కేక్ ని కట్ చేసి అందరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం ఆరు గ్రామాలకు చెందిన పేద వర్గాలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సింగం సుబ్బారావు మాట్లాడుతూ పేద వర్గాలకు సహాయపడటంలో నిజమైన ఆనందం ఉంటుందన్నారు. ప్రతి ఏటా నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా పేద వర్గాలకు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ నూతన సంవత్సరంలో అన్ని వర్గాలు ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. తాడేపల్లిగూడెం నియోజవర్గంలోని అన్ని గ్రామాలలో 16 ఎస్ టి సంఘాలు ఉన్నాయన్నారు. ప్రతి ఏటా తనకున్న దానిలో కొంత పేద వర్గాల కోసం ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. పేద వర్గాలకు సహాయపడటంలో నిజమై ఆనందాన్ని చూస్తున్నామని అన్నారు. నియోజవర్గంలోని సుమారు నాలుగువేల మందికి ప్రతి ఏ ట వస్త్ర దాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు, తనుకు ఏఎంసీ డైరెక్టర్ బండి పార్వతి, వివిధ గ్రామాల ఏకలవ్య సంఘం అధ్యక్షులు చిన్న మర్రి దుర్గయ్య, చిన్న మర్రి శ్రీనివాస్, కల్లి ముత్యాలు, ఎం హరిబాబు, పండు,వెరుగొండ శ్రీను తదితరులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *