సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఉద్యోగులందరిని రెగ్యులరైజ్ చేయాలి
+ సమగ్ర శిక్షా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18600మంది సమగ్ర శిక్షా ఉద్యోగులందరిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పడాల రవీందర్ డిమాండ్ చేసారు. ఈ మేరకు ఆయన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని అతి ప్రాచీన నాగోబా ఆలయంలో తన సతీమణీ, పిల్లలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులందరిని రెగ్యులరైజ్ చేయాలని మొక్కుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర శిక్షా ఉద్యోగులందరిని ఈ కొత్త సంవత్సరంలో రెగ్యులరైజ్ చేయాలని కోరారు. గత ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే, సమగ్ర శిక్షా ఉద్యోగులందరిని రెగ్యులరైజ్ చేస్తామని, కాంగ్రేస్ పార్టీ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. వేల కుటుంబాలు రెగ్యులరైజ్ కోసం ఎదురుచూస్తున్నాయనీ అన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ఏళ్లుగా సమగ్ర శిక్షాలో సేవలందిస్తున్న తమను రెగ్యులర్ చేసి న్యాయం చేయాలని అన్నారు..