సిరా న్యూస్,తిరుమల;
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారు లో తమిళనాడు, కాంచీపురానికి చెందిన ఆనంద్ మురుగన్, మురుగన్ సుబ్బరాజ్ మరో ముగ్గురు కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్నారు. మొదటి ఘాట్ రోడ్డు మీదుగా కిందకు దిగుతుండగా 30వ మలుపు వద్ద ప్రమాదం జరిగింది. భక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు.