`Union Minister’s visit to Vadarevu వాడరేవులో కేంద్ర మంత్రి పర్యటన

సిరా న్యూస్,బాపట్ల;
చీరాల మండలం వాడరేవు లో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పరయటించారు. ముందుగా ఆయన సముద్రతీరాన్ని, మత్స్యకారుల స్థితి గతులను పరిశీలించారు.మత్స్యకారుల కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సాగర పరిశ్రమ కార్యక్రమం లో పాల్గొని మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.మత్స్యకారుల కోసం మోదీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి వారికి తెలియజేశారు.కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ మూర్తి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *