పోలీసులకు పిర్యాదు చేసిన పార్టీ నేతలు
సిరా న్యూస్,డోర్నకల్;
కాంగ్రెస్ ఫ్లెక్సీల ను గుర్తు తెలియని దుండగులు తగల బెట్టారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బు ర్హన్ పురం గ్రామంలో ఘటన జరిగింది. స్థానిక కాంగ్రెస్ శ్రేణులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించి తగుల బెట్టారు అని ఆరోపిస్తున్నారు. 52సంబంధిత విషయం పై పోలీస్ లకు పిర్యాదు చేయనున్నట్టు వారు తెలిపారు..