TSTWR Utnoor: టీఎస్‌టీడబ్ల్యూఆర్‌లో ఘనంగా సావిత్రి బాయి పూలె జయంతి

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:
టీఎస్‌టీడబ్ల్యూఆర్‌లో ఘనంగా సావిత్రి బాయి పూలె జయంతి
తెలంగాణ సామాజిక స్టూడెంట్‌ ఆర్గనైజషన్‌ ఆధ్వర్యంలో టీఎస్‌టీడబ్ల్యూఆర్‌ ఉట్నూర్‌ కళాశాలలో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో సావిత్రి బాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంబ్లె ప్రజ్ఞశీల్‌ మాట్లాడుతూ… సామాజిక అసమానతలు రూపుమాపేందుకు, మహిళా సాధికారత, బాలికల విద్య కోసం సావిత్రి బాయి పూలే విశేషంగా కృషీ చేసారని అన్నారు, మహాత్మా జ్యోతిబా పూలె, సావిత్రి బాయి పూలె దంపతులు ఇద్దరు కలిసి సత్య శోదక సమాజ్‌ ఏర్పాటు చేసి, ఆనాటి సమాజంలో నెలకొని ఉన్న బాల్య వివాహాలు, సతీసహగమనం, మూఢనమ్మకాలు వంటి రుగ్మతలపై అలుపెరుగని పోరాటం చేసారని అన్నారు. వితంతు వివాహాలు జరిపించిన గొప్ప సంఘ సంస్కర్తలు అని కొనియాడారు. బాలికల విద్య కోసం విద్యాలయాలు స్థాపించి, ‘మహిళల హక్కులే సమాజ హక్కులు’ అని నినదించిన మహానీయులు పూలే దంపతులని ఆయన అన్నారు. భారత దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలేను ప్రతీ ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్‌ సుమలత, విద్యార్థులకు మహాత్మ జ్యోతిబా పూలే, సావిత్రి బాయి పూలే, డాక్టర్‌ బాబా సాహేబ్‌ అంబేద్కర్‌ చిత్రపటాలను బహుకరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ.. తమ కళాశాలలో విద్యార్థుల సమక్షంలో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్‌ క్రికెట్‌ లీగ్‌ చైర్మన్‌ దుర్వ మహేష్, నాయకులు ధావుల రమేష్, కొల్లూరి స్వామి, కొత్తపల్లి మహేందర్, భుజంగ్‌ రావు, కళాశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *