శ్రీశైలం చేరుకున్న అయోధ్య అక్షింతలు అక్షింతలకు పూజలు, ఊరేగింపు

సిరా న్యూస్,శ్రీశైలం;
శ్రీశైలం క్షేత్రానికి అయోధ్య రామమందిరం నుంచి శ్రీరాముని అక్షింతలు చేరుకున్నాయి. ఈ పరమ పవిత్రమైన శ్రీరాముని అక్షింతలకు స్థానిక లు మల్లికార్జునస్వామి, భ్రమరాంబికాదేవి ప్రధానాలయం ముందుభాగంలోగంగాధర మండపము వద్ద అక్షింతలకు ప్రత్యేక పూజాదికాలు జరిపించి క్షేత్రపరిధిలో కోలాహలంగా ఊరేగింపు నిర్వహించారు రేపటి నుంచి ఈ నెల 15 వరకు ఇంటింటికీ శ్రీరాముని అక్షింతలను పంపినీ చేయనున్నట్లునిర్వాహకులు తెలిపారు. కాగా శ్రీరాముని అక్షింతలు దేశంలోని నలుమూలలకు పంపిస్తున్న తరుణంలో శ్రీశైలం క్షేత్రానికి కూడా చేరుకోవడంతో తాముకూడా శ్రీరాముని అక్షింతలు పొందుతున్నామని స్థానికులుఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాతాళగంగ ఆంజనేయస్వామి ఆలయం నుండి అక్షంతలు పంపించేస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *