ఎమ్మెల్యే శిల్పా రవి
సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతు నాయకుడు బొజ్జా అరెస్టుకి,వైసిపి పార్టీకి ఏంటి సంబంధం అని ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించారు.ఎస్పీ రీకాల్ చేసుకోమని పోలీసులు ద్వారా చెప్పించినా రైతు సంఘం నాయకులు ఎందుకు పట్టించుకోలేదని అన్నారు. అరెస్టు చేసిన వెంటనే బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్న రైతు సంఘం నాయకుడు తీసుకోలేదు ఎందుకోనని అన్నారు.
ప్రతిపక్ష నాయకులు,ప్రభుత్వంపై అనవసరంగా బురదజల్లే ప్రయత్నం చేయడం మంచిది కాదని మండిపడ్డారు.రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బొజ్జాను అరెస్ట్ చేయడాన్ని,వైసీపికి అంటగట్టడం దారుణమని అన్నారు.వైసీపీ కక్ష కట్టి జైల్ కు పంపినట్లు ప్రతిపక్ష నాయకులు మాట్లాడడం మంచిది కాదని పతిపక్ష పార్టీ నాయకులపై మండిపడ్డారు.
ఈ కేసు 2016 సంవత్సరం టిడిపి ప్రభుత్వంలోనే నమోదైంది,ఈ ఉద్యమంలో వైసిపికి చెందిన రైతులు కూడా ఉన్నారు.ఈ అరెస్టుకు వైసీపీ ప్రభుత్వానికి సంబంధం ఏంటిని ప్రశ్నించారు.రైతు నాయకుడు కోర్టుకు హాజరు కానందకు కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు.2022 సం” మా ప్రభుత్వంలో రైతు నాయకులు ధర్నా చేస్తే ఒక్క రైతు పైన కూడా కేసు నమోదు చెయ్యలేదు.
ప్రతి రైతు బాగుండాలని మా ప్రభుత్వం కోరుకుంటుందని ఎమ్మెల్యే శిల్పా రవి అన్నారు.వైసీపి ప్రభుత్వంపై బురద చల్లే రాజకీయాలు మానుకుంటే అందరికీ మంచిది. ఎన్నికలు వస్తున్నాయని బురదల్లే రాజకీయాలు మానుకోండని ప్రతిపక్షాలకు శిల్పా రవి హితవు పలికారు.