Take advantage of public Welfare schemes ప్రజా సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

సిరా న్యూస్,సంగారెడ్డి;
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమంలో నూతన సంక్షేమ పథకాల కోసం అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని డి ఆర్ డి ఓ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఇస్నాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో డి ఆర్ డి ఓ శ్రీనివాస్. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమలులో భాగంగా వివిధ సంక్షేమ పథకాల కోసం ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజా సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ గడ్డం బాలమణి ,ఎంపిటిసి గడ్డం శ్రీశైలం ,ఎంపీ ఓ హరి శంకర్ గౌడ్, జడ్పిటిసి సుప్రజ ,ఎంపీపీ సుష్మ శ్రీ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *