సిరా న్యూస్,రంగారెడ్డి;
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని పెద్ద మంగళారం గ్రామానికి చెందిన బీర్ల శివకుమార్ (28) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మొయినాబాద్ మండలం పెద్ద మంగళవారం గ్రామానికి చెందిన బీర్ల శివకుమార్ ఒగ్గు కథ చెప్పడానికి షాబాద్ మండలంలోని చందన వెళ్లి దానికి చెందిన కందివనం సుదర్శన్ గౌడ్ ఇంట్లో ఒగ్గు కథ చెప్పడానికి వెళ్ళిన బీర్ల శివకుమార్ ఒగ్గు కథ చెప్తుండగా ఒక్కసారిగా మైకు నుండి షాక్ తగిలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.అతనితో పాటు వచ్చిన తోటి కళాకారుడు కంది జంగయ్యకు తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.