Prajapalana Application Guidelines: ఎవరి ఊర్లో వాళ్లు దరఖాస్తు చేసుకోవాలి

సిరా న్యూస్, చిగురుమామిడి:

ఎవరి ఊర్లో వాళ్లు దరఖాస్తు చేసుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనలో, ప్రజలంత తమ తమ ఊళ్లలోనే దరఖాస్తులు సమర్పించాలని కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండల తహాసీల్దార్‌ నరేందర్‌ అన్నారు. బుధవారం మండలంలోని నవాబ్‌పేట గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి హాజరై, ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కాంగ్రేస్‌ పార్టి మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. అర్హులందరికి ఆరు గ్యారంటీలను పకడ్బందీగా అందించాలనే గొప్ప ఉద్దేశ్యంతో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలంత తప్పక దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఇనుగల శ్రీనివాస్ రెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి షాబుద్దీన్, వికలాంగుల కమిటీ జిల్లా కన్వీనర్ కంది నాగరాజు, సోషల్ మీడియా కన్వీనర్ బోయినీ వేణుగోపాల్, ఎన్ ఐ ఎస్ యూ మండల అధ్యక్షుడు ఠాగూర్ తేజ సింగ్, వార్డు సభ్యులు మాడ శ్రీనివాస్, గ్రామ కో ఆప్షన్ మేంబర్ ఠాగూర్ జితేందర్ సింగ్, మండల యూత్ నాయకులు సంతోష్, బోయిని వంశీకృష్ణ, సుందరగిరి గ్రామ శాఖ అధ్యక్షుడు ఎలగందుల లక్ష్మణ్, గ్రామ శాఖ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కాశపాక సంపత్, సీనియర్ నాయకులు బోయినీ సంపత్, ఠాగూర్ ధర్మేందర్ సింగ్, పిన్ రెడ్డి రామ్ రెడ్డి, ఏన్నం నిఖిల్, బోయిని పరశురాముడు, బోయిని సంజు, బోయిని శంకర్, కాశపాక శ్రీనివాస్, బొయిని దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *