సిరా న్యూస్, జైనథ్:
అర్హులందరికి సంక్షేమ పథకాలు…
అర్హులైన ప్రతీ ఒక్కరి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బుధవారం ఆయన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులతో కలిసి ప్రజల వద్ద నుండి దరఖాస్తులను స్వీకరించారు. అనతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తామని ఆయన అన్నారు. ఆయన వెంట ఎంపిడీవో గజానన్ రావ్, స్థానిక సర్పంచ్ దుమాల దేవన్న, ఎంపిటీసీ కొడిచర్ల సుదర్శన్, బీజేపీ నియోజక వర్గ ఇంచార్జీ భోయర్ విజయ్, మండల అధ్యక్షుడు కట్కం రాందాస్, నాయకులు రాకేష్ రెడ్డి, రమేష్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యేను సన్మానించిన అధికారులు…
ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ను ఎంపిడీవో గజానన్ రావ్, ఇతర అధికారులు, నాయకులు ఘనంగా సన్మానించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యేకు శాలువా, పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.