సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలం ఇస్నా పూర్ పద్మారావు కాలనీ లో ఇంట్లో శాంతమ్మ (40) అనే మహిళ హత్యకు గురయింది. రుద్రారం కు చెందిన సాయిబాబా (26)తన భార్య సత్యవతి (22) ని అత్త సంసారానికి రాకుండా అడ్డుపడుతుందనే కోపం తో అత్తను కత్తి తో పొడిచి హత్య చేసాడు. అడ్డు వచ్చిన భార్య గొంతు కోసి పరారైయాడు. తరువాత నిందితుడు పటాన్ చేరు పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. భార్య గొంతు కోయడంతో అపస్మారక స్థితి లోకి వెళ్లిన సత్యవతి నీ చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు