సిరా న్యూస్, పెంబి:
నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యంగా…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం పనిచేస్తుందని, నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ పటేల్ అన్నారు. గురువారం పెంబి మండల కేంద్రానికి చెందిన వడ్లూరి జగన్నాథ్ ఆపరేషన్ కొరకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి రూ. 2 లక్షలు ఎల్ఓసి అందించారు. ఈ సందర్బంగా ఎమ్మేల్యే బొజ్జు పటేల్ కు నాయకులు, బాధితుడి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సల్ల స్వప్నిల్ రెడ్డి, దోనికేని దయానంద్, బాల్ మంచ్ జిల్లా అధ్యక్షులు తులాల శంకర్, తదితరులు పాల్గొన్నారు.