Free Mid-day-Meal: కాలేజీలో ప్రతిరోజు మధ్యాహ్న భోజనం

సిరా న్యూస్, లోకేశ్వరం:

కాలేజీలో ప్రతిరోజు మధ్యాహ్న భోజనం

+ సొంత డబ్బులతో ప్రారంభించిన అధ్యాపకుడు కారేగాం వినోద్

+ ముఖ్య అతిథిగా హాజరై, అభినందించిన ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇకమీదట ప్రతిరోజు విద్యార్థినీ, విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు కళాశాల అధ్యాపకుడు కారేగాం వినోద్ పేర్కొన్నారు. గురువారం కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో, ఈ మేరకు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ చేతులమీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అధ్యాపకుడు కారేగాం వినోద్ మాట్లాడుతూ… ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్నం పూట ఇబ్బంది లేకుండా ఉండే విధంగా తన వంతుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం అందించాలని ప్రయత్నం చాలా గొప్పదని అన్నారు. ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *