సిరా న్యూస్, సూర్యాపేట:
గానుగబండ చేరిన అయ్యోద అక్షింతలు..
పల్లకిలో ఊరేగింపు..
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామం లో ఇంటింటికి అయోధ్య అక్షింతల పంపిణీ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీరాముని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, భజనలు చేశారు. ఈ సందర్భంగా పల్లకిలో అక్షింతలు, స్వామివారు చిత్రపటాలను ప్రతిష్ఠించి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట చేయబడిన అక్షింతలను, శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ తరఫున ఇంటింటికి పంపిణీ చేస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రంగా వీరస్వామి, పాకాల పరమేష్, అంజి రెడ్డి, సిహెచ్ వెంకటేశ్వర్లు, జయమ్మ, ఈశ్వరమ్మ, తదితరులు పాల్గొన్నారు.