కమ్యూనిటీ హాల్ నిర్మించండి సారూ

 సిరా న్యూస్,ఏలూరు;
ప్రత్తికోళ్ల లంక గ్రామం లో 12 ఏళ్లనాడు బిసి కాలనిలో కమ్యూనిటీ హాలు నిర్మించేందు కు వేసిన శిలాఫలకం నేటికి ఆరంభ సూరత్వంగానే మిగిలిపోయింది.అప్పటి టి డి పి ప్రభుత్వం అధికారం లో ఉండగా బి సికాలనిలో కమ్యూనిటీ హాలు నిర్మించేందుకు శంఖుస్థాపన చేసి శిలా పలకం నిర్మించారు.అప్పట్లో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి ఏ గ్రహణం పట్టిందో గాని ఇప్పటి వరకు అప్పుడు వేసిన శిలా ఫలకం నేటికి గ్రామానికిగుర్తుగా ఒక శిలారాయిగానే మిగిలిపోయింద ని తెలిపారు. అప్పటి ఎం పి కావూరి సాంబశివరావు ఎం పి ల్యాడ్స్ నుండి 3 లక్షల రూపాయల నిధులుమంజూరు చేశారని రాజకీయ నాయకులు గ్రామం లో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి అట్టహాసంగా హడావుడి చేసి శంఖుస్థాపన చేసి అనాదగా వదిలేసి నేటికి 12 ఏళ్ళు కావస్తున్నా ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదనిప్రత్తి కోళ్ల లంక బి సి కాలనీ ప్రజలు వాపోతున్నారు.ఇప్పటి కైనా సంబంధిత అధికారులు స్పందించి డ్వాక్రా మహిళల సౌకర్యార్థం కమ్యూనిటీ భవనం నిర్మించాలని కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *