సిరా న్యూస్,తెనాలి;
తెనాలి గంగానమ్మపేటలో వివాహిత దారుణ హత్యకు గురయింది. భవనం వారి వీదిలో నివాసం ఉంటున్న రామిశెట్టి అలెక్య (35) ను దుండగులు గొంతు కోసి హత్య చేసారు. అన్నం శ్రీనివాస్ అనే వ్యక్తితో అలేక్యకి గత ఏడు సంవ్సరాలుగా వివాహేతర సంబంధం ఉందని భర్త రమేష్ ఆరోపిస్తున్నాడు. ఇరువురి మధ్య కోర్టులో కేసులు నడుస్తున్నాయి. భవనంలోని కింద గదిలో ఉన్న తన భార్య అలేఖ్యని గత రాత్రి అక్రమ సంబంధం పెట్టుకున్న శ్రీనివాస్ హత్య చేసినట్టు భర్త రమేష్ ఆరోపించాడు. గదిలో గొంతు కోసి హత్యకు గురై నగ్నంగా అలేఖ్య మృతదేహం పడివుంది. రెండవ టౌన్ పోలీసులు ఘటన స్థలంలో విచారణ చేస్తున్నారు.