సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం భైరవునిపల్లి లో దారుణం చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన వివాహితను శ్రీను అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు.సైదమ్మ అనే వివాహిత ను శ్రీను గత కొంతకాలంగా వేధిస్తున్నాడు.తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని శ్రీను అడుగుతుండగా ఆమె నిరాకరిస్తూ వస్తుంది.ఈ క్రమంలో సైదమ్మ ఒంటరిగా ఉండటం గమనించిన శ్రీను మరోసారి అడుగగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సైదమ్మ పై శ్రీను కత్తితో దాడి చేశాడు.ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ సైదమ్మ ను స్థానికులు నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. జరిగిన హత్య పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
========================