సిరా న్యూస్,రంగారెడ్డి;
మైలార్ దేవ్ పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పల్లె చెరువు వద్ద ఆర్టీసీ బస్సును కూరగాయల ఆటో ఢీ కొట్టింది.ఘటనలో ఆటో లో ప్రయాణిస్తున్న ఆటో డ్రైవర్ లింగస్వామి, వెంకన్న లకు తీవ్ర గాయాలు అయ్యాయి.వారిని హుటాహుటిన మలక్పేట్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. ప్రమాదంలో ఆటో ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. శంషాబాద్ మార్కెట్ నుండి కూరగాయలు తీసుకొని చంద్రాయణ్ గుట్ట వైపు ఆటో వెళుతుంది. పల్లె చెరువు వద్దకు రాగానే ముందు వెళుతున్న ఆర్టీసీ బస్సు ను ఆటో ఢీ కొట్టింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఢీ కొట్టి నట్లు సమాచారం.
=========