సిరా న్యూస్;
ఇన్స్టాగ్రామ్లో వచ్చిన ప్రకటనను నమ్మి ఓ వ్యాపారి దాదాపు రూ.40.67 లక్షల సొమ్ము నష్టపోయాడు. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్సై రాజ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉంటోన్న ఓ వ్యాపారి మొబలై ఫోన్కు ఈ ఏడాది జనవరిలో గుర్తు తెలియని వ్యక్తులు ఇన్స్టాలో ఆన్లైన్ ట్రేడింగ్ యాప్ పేరుతో ఓ లింక్ పంపించారు. ఈ యాప్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు పొందవచ్చని నమ్మించారు. అందుకు ఫోన్లో మరో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. దాని ద్వారా ఎంత లాభం వస్తుందో స్వయంగా చూసుకునే అవకాశం ఉంటుందని నమ్మబలికారువారి మాయమాటలు నమ్మని వ్యాపారి తన వద్ద ఉన్న రూ.40.67 లక్షలను గుర్తుతెలియని వ్యక్తుల ఖాతాకు ఆన్లైన్లో బదిలీ చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో వారు వ్యాపారి పెట్టుబడికి రూ.19.16 లక్షల లాభాలు వచ్చాయంటూ మరో లింక్ పంపించారు. అది పొందాలంటే 15 శాతం ఆదాయపన్ను చెల్లించాలని, లేదంటే మొత్తం నగదు సంస్థకు తిరిగి వెళ్లిపోతుందని తెలిపారు. వారు చెప్పినట్లు చేస్తున్నక్రమంలో పెట్టుబడి ఖాతాలో వారు చూపిన రూ.19.16 లక్షలు ఉపసంహరించుకుని జీరో బ్యాలెన్స్ చూపారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్కు (1930) ఫిర్యాదు చేశాడు. ఆదివారం మరోమారు కేయూ పోలీసు స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు.