లారీని ఢీకొన్న కారు..ఒకరు మృతి

సిరా న్యూస్,రంగారెడ్డి
ఎల్బీనగర్ లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హయత్ నగర్ నుండి మాదాపూర్ కు వెళ్తుండగా ఎల్బీనగర్ లో ఆగివున్నా లారీ ని కారు బలంగా ఢీకొట్టింది. కారు లో ఉన్నఇద్దరు మృతి చెందరు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. మృతులు మీర్ పేట్ కు చెందిన సాప్ట్ వేరే ఇంజనీర్ బొల్లం ప్రణయ్(29) వనస్థలిపురంకు చెందిన కుంచల రవిగా గుర్తించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటం తో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం తో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కార్ నీ పక్కకు తీసి ట్రాఫిక్ నీ క్లియర్ చేసారు. .
=================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *