A car crashed into a farm well in the middle of the night : అర్ధరాత్రి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు

సిరా న్యూస్,పెద్దపల్లి
అదుపు తప్పిన కారు వ్యవసాయ బావిలోకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ముగ్గురు క్షేమంగా బయట పడ్డారు. ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రం శివారులో జరిగింది.శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో నిమ్మనపల్లి నుండి పెద్ద కలువలకు వెళ్తున్న నెక్సా కారు ( టీ ఎస్ 10 ఈఎల్ 2029) గల అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకు వెళ్ళింది.ఈ ప్రమాదంలో రంగంపల్లికి చెందిన వినీత్ రెడ్డి అక్కడి కక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న గాదె అఖిల్, అల్లం బాల అనురోహిత్ రెడ్డి, సాయిలు బావిలో నుండి పైపు ద్వారా బయ టికి వచ్చి క్షేమంగా బయటపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *