జోరుగా మైకుల హోరు…

పతాకస్థాయికి చేరిన ప్రచారం
సిరా న్యూస్,వరంగల్;
13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో…..ప్రధాన రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. అన్ని పార్టీలు ప్రచారంలో ఆరాటం, ఆర్భాటం , పోరాటం ప్రదర్శిస్తున్నాయి. ప్రచారానికి తమ స్టార్ క్యాంపెయినర్లను బరిలోకి దింపుతున్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ…..ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులు, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉన్న నేతలను ప్రచారాలకు దింపుతున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సైతం జిల్లాలో పర్యటిస్తూ…. పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్పంచుకుంటున్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటన పూర్తి చేయగా….. పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అంతకుముందు వరంగల్ లోక్ సభ నియోజకవర్గ ముఖ్య నేతలతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశం అయ్యారుహనుమకొండలోని కెప్టెన్ లక్ష్మీ కాంతరావు నివాసంలో బస చేయనున్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వారం రోజుల వ్యవధిలోనే వరంగల్ పార్లమెంటరీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ రెండో బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు ఒకే లోక్ సభ నియోజకవర్గ పరిధిలో రెండు బహిరంగ సభలు జరగలేదు. అయితే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. అందులో భాగంగానే ఈనెల 30వ తేదీన రేగొండ మండల కేంద్రంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా వస్తున్నారు.ఈ నేపథ్యంలో శనివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అందుకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు.మరోవైపు వరంగల్ లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ను గెలిపించాలని కోరుతూ….. మే 3న హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ శివారులో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారు కాగా…… అందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర బీజేపీ నేతలు పర్యవేక్షిస్తున్నారు. నరేంద్ర మోదీతో పాటు జాతీయస్థాయి నేతలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొంటారని సమాచారం. వరంగల్ సెగ్మెంట్ పై బీజేపీఆశలు పెట్టుకుంది. ఆరూరి రమేష్ నామినేషన్ కు ఉత్తర్ ప్రదేశ్ సీఎం పుష్కర్ సింగ్ హాజరయ్యారు. ఇక నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈనెల 29తో ముగియనుంది. దీంతో ఫైనల్ గా ఎంత మంది అభ్యర్థులు బరిలో నిలుస్తారు? ఒక్కో సెగ్మెంట్ కు ఎంత మంది ఫైనల్ గా పోటీ పడుతున్నారు అనేది రేపటితో క్లారిటీ రానుంది. మొత్తానికి సరిగ్గా 10 రోజుల పాటు ఎన్నికల ప్రచారం రాష్ట్రంలో జోరుగా సాగనుంది.
==========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *