సిరా న్యూస్,పుంగనూరు;
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో అగ్నిప్రమాదం సంభవించింది. పుంగునూరు మండలం బైనపల్లి వద్ద నీలగిరి తోటలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొన్న
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ధూమపానం సేవించి నిర్లక్ష్యంగా ఆర్పకుండా పడవేయడంతో అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు.
====