సిరా న్యూస్,కమాన్ పూర్;
కమాన్ పూర్ మండలం పెంచికలపేట గ్రామంలో గురువారం కృషి విజ్ఞాన కేంద్రం రామగిరి ఖిల్లా వారు. మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా “సామూహిక ప్రధమ శ్రేణి ప్రదర్శన క్షేత్రం”నిర్వహించారు .ఇందులో భాగంగా వేరుశనగలో క్షేత్ర దినోత్సవం కార్యక్రమాన్ని పెంచికలపేట గ్రామంలో జరిపారు. ఈ సంవత్సరం గాను సామూహిక ప్రధమ శ్రేణి ప్రదర్శన క్షేత్రంలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో 37 1/2 ఎకరాలకు గానూ వేరుశనగ విత్తనాన్ని ఈ యాసంగి సీజన్ నందు పలు గ్రామాలలో పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ పిల్లి మృత్తిక శాస్త్రవేత్త మాట్లాడుతూ వేరుశనగ పంట యాజమాన్యం మరియు సస్యరక్షణ గురించి రైతులకు వివరించడం జరిగినది మరియు వేరుశనగ పంట వల్ల నేలకు జరిగే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి అజ్మీర సురేష్ మాట్లాడుతూ పంట మార్పిడి యొక్క ప్రాముఖ్యతను మరియు దాని యొక్క అవసరాన్ని రైతులకు తెలియజేయడం జరిగినది. కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ అండ్ హెడ్ డాక్టర్ ఏ శ్రీనివాస్ కె వి కే యొక్క ప్రాముఖ్యత మరియు క్షేత్ర ప్రదర్శనలను రైతులకు ఎలా ఉపయోగపడతాయో వివరించడం జరిగినది అంతేకాకుండా నూనె గింజల యొక్క ప్రాముఖ్యత మరియు నూనె ఉత్పత్తిలో జరుగుతున్న కల్తీ ల గురించి రైతులకు చెబుతూ కెవికె అందిస్తున్న ఈ సేవలను వినియోగించుకొని మంచి లాభాలు సాధించాలని కోరారు.అనంతరం వివిధ వేరుశనగ క్షేత్రాలను పరిశీలించి రైతుల యొక్క అనుభవాలను తెలుసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రామ స్పెషలాఫీసర్ మహేందర్ , కెవికె హెడ్ డాక్టర్ శ్రీనివాస్ , మృతిక శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ పిల్లి, వ్యవసాయ విస్తరణ అధికారి అజ్మీర సురేష్ మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.