చేపల వలలో కొండ చిలువ

సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ జిల్లా ముడుచింతలపల్లి మండలంలోని లక్ష్మపూర్ గ్రామంలో వింత సంఘటన ఎదురైంది. లక్ష్మపూర్ లోని బెస్తలు చేపలు పట్టేందుకు గూడెం చెరువుకు వెళ్లి చేపల కోసం వల వేశారు. కొద్దిసేపు వేచి చూసి వలను బైటికి తీయడం మొదలుపెట్టారు. వల బరువుగా ఉండడంతో చాలా చేపలు పడ్డాయని బైటికి లాగేసరికి ఒక్కసారిగా కంగుతిన్నారు. వలలో చేపలకు బదులు కొండచిలువ దర్శనం ఇవ్వడంతో జళారులు భయందోళనకు గురయ్యారు. వెంటనే జళారులు కొండచిలువను కర్రలతో కొట్టి చంపారు. అది సుమారు 10 అడుగుల వరకు ఉంటుందని జాలరులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *