తలసాని ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ,

ప్రారంభించిన పద్మారావు గౌడ్

 సిరా న్యూస్,సికింద్రాబాద్;
ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ ని సికింద్రాబాద్ బీ.ఆర్.ఎస్. అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. షెనాయ్ నర్సింగ్ హోం నుంచి ప్రారంభమయిన ఈ ర్యాలీ చిలకలగూడ చౌరస్తా, పద్మారావు నగర్ మీదుగా సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే వివిధ ప్రాంతాల మీదుగా సాగింది. వేల సంఖ్యలో మోటార్ బైక్ ల పై కార్యకర్తలు ర్యాలి లో పాల్గొనగా అగ్ర భాగంలో పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లతో పాటు మాజీ ఛైర్మన్ రాజేవ్ సాగర్, నేతలు వెంకట్ రెడ్డి, పవన్ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు, నాయకులు ప్రచార రధం నుంచి పౌరులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తమ పార్టీ భారీ విజయాన్ని బైక్ ర్యాలీ చాటుతోందని పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *