భారీ అగ్ని ప్రమాదం

సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తంగడంచ లో గ్రామ సమీపంలో ఉన్న జైన్ ఇరిగేషన్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం కంపెనీ పరిసరాల్లో ఉన్న పొలాల గట్లకు ఉన్న పిచ్చి మొక్కల ను కాల్చే క్రమంలో రైతులు నిప్పంటించారు.దీనితో గట్ల వెంబడి కాలుకుంటూ కంపెనీలోని గోదాముకు మంటలు అంటుకున్నాయి.ఒక్కసారిగా ఇరువైపుల నుంచి మంటలు అంటుకోవడంతో కంపెనీ అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.మంటలను అదుపు చేసేందుకు మూడు ఫైర్ ఇంజన్లతో పాటు ప్రైవేటు వాహనాలతో కూడా మంటలను ఆర్పేందుకు ఫైర్ శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో మరింత నష్టం జరగకుండా ఫైర్ శాఖ సిబ్బంది కాపాడారు.ఈ అగ్ని ప్రమాదంలో రైతులకు కావాల్సిన డిప్పు పైపులు, పీవీసీ పైపులు ,మోటార్లు, మరికొన్ని వ్యవసాయ పనిముట్లు కాలిపోయాయి.
======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *