భార్యే చంపి వుంటుందన్న అనుమానాలు
సిరా న్యూస్,నెల్లూరు;
పాకనాటి అయ్యప్ప అనే వ్యక్తికి అతని భార్యకు మధ్య గత కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. అయ్యప్ప రాజేశ్వరి అనే మరో మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో భర్త అయ్యప్ప గత రాత్రి ఇంట్లో చనిపోయి పడి ఉన్నాడు. మృతుని సోదరుడు అయ్యప్ప మృతి పట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వదినపై అనుమానం వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి , సిఐ శ్రీనివాసరావు అయ్యప్ప మృతికి గల కారణాలను ఆరా తీశారు. భార్య దుర్గను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.