సిరా న్యూస్,హైదరాబాద్:
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. యూసుఫ్ గూడలో రాములు అనే వ్యక్తిని రాత్రి 11 గంటల సమయంలో 10 మంది గుర్తు తెలియని దుండగులు కత్తులతో వచ్చి అత్యంత దారుణంగా హత్య చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో స్పాట్ చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ సింగోటం రాములు గత కొంత కాలంగా పలు సోషల్ సర్వీస్ చేస్తున్నాడు. గత ఎన్నికల్లో బిజెపి పార్టీలో చేరిన రాములు, హత్యకు గల కారణాలపై జూబ్లీహిల్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు. న దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.