సిరా న్యూస్,నెల్లూరు;
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పడమటినాయుడు పల్లి గ్రామంలో పంట పొలాలో వున్న బావి లో దాహం తీర్చుకోవడానికి వచ్చిన దుప్పి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది.పైకి ఎక్కే మార్గం లేక బావిలోనే ఉండిపోయింది. ఇది గమనించిన స్థానిక గొర్రెల కాపరులు గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు దుప్పిని రక్షించి బయటకు తీసారు.