సిరా న్యూస్,రంగారెడ్డి;
చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోని లైఫ్ లైన్ ఆసుపత్రి వద్ద ఉన్న చెత్త కుప్పలో తాజాగా అప్పుడే పుట్టిన మగ శిశువును పడేసిన అమానవనీయ సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఆ పసికందు మాత్రం క్షేమంగానే ఉండడం దేవునిలీల. పూర్తి వివరాల్లోకి వెళితే గురువారం రాత్రి సుమారు 2 గంటల సమయంలో చెత్త కుప్పలో నుంచి పసికందు ఏడుపులు వినిపించాయి. దీంతో అక్కడ ఉన్న స్థానికులు వెళ్లి చూడగా మగ శిశువు కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఠాణా ఇన్స్పెక్టర్ గురునాథ్ ఆదేశాల మేరకు ఏఎస్ఐ వెంకటేష్ ఘటన స్థలానికి చేరుకొని చిన్నారి బాలుడిని బయటికి తీసి చూడగా అదృష్టవశాత్తు ఆ పసికందు క్షేమంగానే ఉండడంతో మెరుగైన వైద్య చికిత్స అందించడం కోసం 108 అంబులెన్స్ ద్వారా శిశువును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చాంద్రాయణగుట్ట పోలీసులు. దీంతో నవ మాసాలు మోసిన కన్నపేగును కసాయి తల్లి అప్పుడే పుట్టిన శిశువును ఎలా చెత్త కుప్పలో పడేసిందో అన్ని ఇంత దారుణానానికి పాల్పడి తల్లితండ్రులపై ఆశ్చర్యం వ్యక్తం చేసారు స్థానిక ప్రజలు, మహిళలు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శిశు వు తల్లిదండ్రుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.