సిరా న్యూస్,కాకినాడ;
యాంకర్: ఎస్ సి రిజర్వేషన్ల వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ మాల మహానాడు, ఆర్.టి.ఐ తదితర సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహిస్తున్న బంద్ జిల్లాలో ప్రశాంతంగా జరుగుతోంది. వాయిస్: రిపబ్లిక్ కెన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు పిట్టా వరప్రసాద్, మాల మహానాడు జేఏసీ కన్వీనర్ సిద్ధాంతుల కొండబాబు, కాకినాడ పార్లమెంట్ ఇంచార్జ్ ఏనుగుపల్లి కృష్ణ తదితరుల ఆధ్వర్యంలో ఎస్ సి సంఘాల నాయకులు కాకినాడలో పర్యటిస్తూ ఎక్కడికక్కడ బంద్ చేయిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు తిరగకుండా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లాపై బంద్ ప్రభావం కనిపిస్తోంది.