ఎదురు కాల్పుల్లో పోలీసు, మావోయిస్టు మృతి

సిరా న్యూస్,బీజాపూర్;
ఆంధ్రా-ఛత్తీస్ఘడ్ సరిహద్దుల్లో కాంకేరి జిల్లా చోటేబైథియా పోలీస్స్టేషన్ పరిధిలోని హిదూర్ అడవుల్లో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు.మృతున్ని గుర్తించాల్సి ఉందని కాంకేర్ జిల్లా ఎస్పీ కళ్యాణ్ ఇలేసియా తెలిపారు.
హిదూర్ అటవీప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు డీఆర్జీ, బీఎస్ ఎఫ్, బలగాలు భారీ ఎత్తున గాలింపు చర్యలు నిర్వహించారు. సుమారు గంటన్నర సేపు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఒక మావోయిస్టు, ఒక పోలీసుకానిస్టేబుల్ మృతి చెందారు. కాల్పులు ముగిసిన అనంతరం సంఘటనస్థలాన్ని పోలీసులు గాలించగా ఒక ఏకే 47 తో బాటు భారీ మొత్తంలో మావోయిస్టు సామాగ్రీ స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *