కల్వర్టును ఢీకొన్న ప్రైవేటు బస్సు..ఇద్దరు మృతి

సిరా న్యూస్,కర్నూలు;
కర్నూలు ఓర్వకల్లు మండలం పూడిచెర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున శ్రీ కార్తీక్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కల్వర్టు ను బలంగా ఢీకొనింది.ప్రమాదంలో బస్సు డ్రైవర్ శ్రీనివాసులు, ప్రయాణికుడు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉనట్లు సమాచారం.రాత్రి తిరుపతి నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ఘటన జరిగింది. తెల్లవారుజామున కావడంతో డ్రైవర్ నిద్ర మత్తులో ఉందట కలవటం ఢీకొన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.డివైడర్ ఢీకొన్న బస్సును క్రేన్ సహాయంతో నన్నూరు టోల్ ప్లాజా సిబ్బంది పక్కకు తీశారు.క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఓర్వకలు ఎస్సై రాజారెడ్డి తెలిపారు.
=================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *