సిరా న్యూస్;
వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కౌన్సిలర్లు వైకాపాను వీడారు. మెుత్తం 11 మంది వైకాపా, స్వతంత్ర కౌన్సిలర్లు ఎమ్మెల్యే ఎమ్.ఎమ్ కొండయ్య సమక్షంలో తెదేపాలో చేరారు. మద్ధతు ఇచ్చిన వారిని ఎమ్మెల్యే పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వంలో మెరుగైన పాలనను అందేంచేందుకు తమతో కలిసి ప్రయాణం చేసేందుకు కౌన్సిలర్లు ముందుకు రావడం హర్షనీయమన్నారు. అందరి సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
=====