A staggered Master Blaster: తడబడిన మాస్టర్‌ బ్లాస్టర్‌ జోగు మహేందర్‌…

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

తడబడిన మాస్టర్‌ బ్లాస్టర్‌ జోగు మహేందర్‌…

+ జోగు రామన్న వరుస విజయాలకు బ్రేక్‌
+ 15 ఏండ్లు అన్ని తానై నడిపించిన జోగు చిన్న కుమారుడు మహేందర్‌
+ కార్యకర్తలతో గ్యాప్‌ పెర్గడంతోనే ఓటమిపాలైనట్లు చెబుతున్న విశ్లేషకులు

జోగు మహేందర్‌.. ఆదిలాబాద్‌ నియోజక (Adilabad Sssembly) వర్గ ప్రజలకు చాలా సుపరిచతమైన పేరు. మీడియాలో పెద్దగా ఫోకస్‌ కానప్పటికీ, తెర వెనుక మాత్రం పార్టీ క్యాడర్‌ను నడిపించే ‘వన్‌ మ్యాన్‌ ఆర్మీ’ గా, మాస్టర్ బ్లాస్టర్ (Master బ్లాస్టర్) గా  బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు అతన్ని గుర్తిస్తారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా జోగు రామన్న(MLA Jogu Ramanna) గెలుపు వెనుక ఉన్న తెర వెనుక హీరోగా అతన్ని అభివర్ణిస్తారు. చిన్న వయసులోనే పార్టీ కార్యక్రమాల నుంచి కార్యకర్తల పనుల వరకు అన్నీ ఒంటి చేత్తో మేనేజ్‌ చేస్తూ గ్రేట్‌ లీడర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన, తన తండ్రి జోగు రామన్న గెలుపే లక్ష్యంగా గత 15 సంవత్సరాలుగా పార్టీని భుజాన వేసుకొని నడిపిస్తున్నారు. వరుస విజయాలే కాకుండా మరెన్నో అపవాదులను సైతం తన ఖాతాలో వేసుకున్న జోగు మహేందర్‌పై(Jogu Mahendar) సిరా న్యూస్ (Sira News) స్పెషల్‌ స్టోరీ…

అన్ని తానై…
జోగు రామన్న ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు అన్ని తానై నడిపించిన జోగు మహేందర్‌ను చూసి ప్రతిపక్షాలతో పాటు స్వపక్షంలో కూడ చాలా మంది విమర్శలు గుప్పించారు. సొంత పార్టీలోనే కొంత మంది లీడర్లకు జోగు మహేందర్‌ అన్ని తానై నడిపించడం నచ్చలేదు. కానీ చిన్న వయసులో ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీ కోసం, తండ్రి జోగు రామన్న గెలుపు కోసం పనిచేస్తున్న తీరు యువ కార్యకర్తలు, నాయకులను విపరీతంగా ఆకర్షించింది. దీంతో అనేక మంది యువకులు బీఆర్‌ఎస్‌లో చేరి జోగు మహేందర్‌ సైన్యంగా మారి అతనికి అండగా నిలబడ్డారు. దీంతో 15సంవత్సరాల పాటు ఆదిలాబాద్‌లో ఆయకు ఎదురులేకుండా పోయింది.

కొంపముంచిన గ్యాప్‌…
ఎన్నికల్లో గెలుపోటములు అత్యంత సహజమైన విషయం అయినప్పటికీ వరుస విజయాలతో ఉన్న జోగు మహేందర్‌కు పార్టీ క్యాడర్‌తో గ్యాప్‌ రోజు రోజుకీ పెరుగుతూ వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో సైతం చాలా మంది కార్యకర్తలు అతని వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సన్నిహితులు చెబుతారు. కార్యకర్తలకు, నాయకులకు సమయం ఇవ్వడం లేదని కనీసం ఫోన్లో కూడ అందుబాటులోకి రావడం లేదంటూ జోగు రామన్న వద్ద ఫిర్యాదులు వెళ్లాయి. కానీ 2018లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ హవా ఉండటం, అప్పట్లో మంత్రిగా ఉన్న జోగు రామన్న ఆదిలాబాద్‌లో మునుపెన్నడూ లేని విదంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో 2018 ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో గ్యాప్‌ మరింత ఎక్కువ కావడంతో క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు అంత పట్టుదలతో పనిచేయలేదనే వాదన వినిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడ ఆదిలాబాద్‌ ప్రజలు మాత్రం జోగు మహేందర్‌ స్ట్రాటజీలు ఈ సారి పారలేదని, కంది శ్రీనివాస రెడ్డిని సైతం తక్కువ అంచనా వేయడంతోనే పరాజయం మూటగట్టుకున్నారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ‘కాసిన చెట్టుకే రాళ్లు’ అన్న చందంగా.. రాజకీయాల్లో ఉన్నవారికి కీర్తీ, అప కీర్తీ రెండు చాలా కామన్‌ అయినప్పటికీ కూడ ఇన్ని ఏండ్లు ఆదిలాబాద్‌లో అధికారంలో ఉండి, ఏక చత్రాధిపత్యంగా చక్రం తిప్పిన జోగు మహేందర్‌ ఈ ఓటమి ఎలా విశ్లేషిస్తారు? వచ్చే ఎన్నికల కోసం ఎలా సిద్దం అవుతారు? వచ్చే 5సంవత్సరాలు ప్రతిపక్షా హోదాలో ఎలాంటి సేవలందిస్తారు? ఇప్పుడైన ప్రత్యక్ష రాజకీయాల్లోకి క్రియాశీలకంగా వస్తారా అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *