సిరా న్యూస్,కడప;
మూఢనమ్మకం ఇద్దరి ప్రాణాలు బలి తీసుకుంది.దర్గాలో బాబా చెప్పాడని కుందూ నదిలో స్నానానికి అన్నా చెల్లెలు వెళ్లారు.అక్కడి ఇసుక గుంతల్లో చిక్కుకొని మృతి చెందారు. రాజుపాలెం మండలం కూలూరు వద్ద కుందూనదిలో ఘటన జరిగింది. నంద్యాల జిల్లా చాగలమర్రి కి చెందిన షేక్ ఖాజా హుస్సేన్ అతని భార్య ఇమాంబి, బావమరిది మస్తాన్ లు ఎర్రగుంట్ల దర్గాకు వచ్చి పూజలు జరిపారు. తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు కుందూ నదిలో స్నానం చేసి వెళ్లాలని అక్కడున్న ఒక బాబా వెళ్లాలని చెప్పినట్లు సమాచారం. ఖాజా హుస్సేన్ గట్టునే ఉండగా నీటిలో మునగడానికి మస్తాన్, ఇమాంబి వెళ్లారు. అక్కడి ఇసుక గుంతల్లో చిక్కుకుని చనిపోయారు.పోస్టుమార్టం నిమిత్తంప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాలు తరలించారు.
================