మదనపల్లెలో టీచర్ దారుణ హత్య

సిరా న్యూస్,మదనపల్లె;
మదనపల్లె ఎగువ కురవంకలో జి ఆర్టీ స్కూల్ టీచర్ దొరస్వామి బుధవారం అర్థ రాత్రి దారుణ హత్యకు గురైయ్యాడు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. కురవంక పార్క్ సమీపంలోని ఆంజనేయుని గుడికి సమీపంలో మిద్దె పైన హత్య జరిగింది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఈ హత్య జరిగినట్లు తెలస్తోంది…. ఎవరో పథకం ప్రకారం దొరస్వామిని దారుణంగా హత్య చేసినట్లు సంఘటన స్థలంలో మృతదేహం పడి ఉన్న తీరును బట్టి తెలుస్తోంది. హత్య జరిగిన ప్రదేశానికి వన్ టౌన్ సీఐ వల్లి బాష పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
===============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *