ఉపాధ్యాయుని దాష్టికం

మార్కులు తక్కువగా వచ్చాయని విద్యార్థులను చితకబాదిన వైనం
జాతీయ రహదారిపై తల్లిదండ్రుల బైటాయింపు
 సిరా న్యూస్,ఖమ్మం;
తెలుగులో మార్కులు తక్కువగా వచ్చాయని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పదోవతరగతి విద్యార్థులను ఓ ఉపాధ్యాయుడు చితకబాదిన సంఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో వెలుగు చూసింది. తిరుమలాయపాలెం మండలంలోని మహ్మదాపురం శివారు, మాదిరిపురం సుబ్లేడు క్రాస్ రోడ్డువద్ద గలా ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలో చదువుకుంటున్న టెన్త్ క్లాస్ విద్యార్థులకు తెలుగు సబ్జెక్టు పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని లక్ష్మణ్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులను విచక్షణ రహితంగా కొట్టి గాయపరిచాడు.దీనితో ఉపాధ్యాయుడు దాడి చేసిన
సంఘటన విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు అక్కడకు చేరుకున్నారు. విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు లక్ష్మణ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఖమ్మం-వరంగల్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు.సమాచారం అందుకున్న ఎస్సై గిరిధర్ రెడ్డి హాస్టల్ వద్దకు వెళ్లి,ఆందోళన చేస్తున్న పేరెంట్స్ కు నచ్చచెప్పి దాడి చేసిన ఉపాధ్యాయుడు లక్ష్మణ్ ను పోలీస్టేషన్ కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *