సిరా న్యూస్,నిర్మల్;
యాంకర్ పార్ట్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలోనీ బస్సు ఆదివారం రాత్రి అపహరణకు గురికావడం కలకలం రేపింది. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో ఆర్టీసీ డిపో గోడదూకి అందులోకి ప్రవేశించాడు. ఏపీ 01Z 0076 నంబర్ గల ఆర్టీసీ బస్సును అపరించాడు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది బస్సును వెంబడించడంతో 3 కి.మీ దురలో సోఫీ నగర్ వద్ద బస్సు ప్రమాదానికి గురిఅవ్వడంతో సెక్యూరిటీ సిబ్బంది బస్సును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకొని బస్సు ఎత్తుకెళ్ళిన దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు…